రాష్ట్రంలో వర్షాలు, వరదలు.. ప్రభుత్వం హై అలర్ట్

by Vemula.Srinu Prasad |

ఏపీలో వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది....

రాష్ట్రంలో వర్షాలు, వరదలు.. ప్రభుత్వం హై అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో వాతావరణ శాఖ(Weather Department) మరో రెండు రోజుల పాటు వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రులు, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారలుతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు. అలాగే దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుత ప్రకాశం బ్యారేజికి వరద పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Next Story