Ap News: ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం.. త్వరలో వాళ్లూ బదిలీ?

by Disha Web Desk 16 |
Ap News: ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం.. త్వరలో వాళ్లూ బదిలీ?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న లక్షా 67 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడుళ్లుగా పని చేస్తున్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఉందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రెండేళ్లు పూర్తై, ప్రొబేషన్ డిక్టేర్ అయిన ఉద్యోగులు బదిలీలకు అర్హులని పేర్కొన్నారు. అంతర్ జిల్లా బదిలీల్లో స్సౌస్, మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించనున్నట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

Also Read...

ఉత్కంఠ రేపుతోన్న సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్



Next Story