ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించిన కీలక అంశాలు ఇవే..!

by Disha Web Desk 16 |
ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించిన కీలక అంశాలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఆయన ఏపీ అంశాలపై ప్రధాని మోడీతో గంటన్నర పాటు చర్చలు జరిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం నిర్వాసితుల పరిహారం వంటి వాటిని ప్రధాని మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మోడీతో భేటీ అనంతరం నిర్మాలా సీతారామన్‌ను సీఎం కలిశారు. పార్లమెంట్ భవనంలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరగా విడుదల చేయాలని కలిశారు. ఈ భేటీ అనంతరం సీఎం జగన్ ఏపీకి బయల్దేరతారని తెలుస్తోంది. కాగా ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ పెద్దలను చంద్రబాబు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోడీతో భేటీపై రాజకీయ ప్రాధాన్యతను చోటు చేసుకున్నాయి.

Also Read..

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ.. ఏపీ హామీలపై చర్చ



Next Story

Most Viewed