మళ్లీ ఆదరించండి.. ఏపీ ప్రజలకు సీఎం జగన్ కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-05-01 10:22:37  IST  )

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు..

AP News CM Jagan Lays The Foundation Stone For Apache Company
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేశామని చెప్పారు. ఎన్నికల్లో వేసే ఓటే రాబోయే ఐదేళ్ల భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. తమ 58 నెలల పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు పంపిణీ చేశామన్నారు. వైసీపీకి ఓటే వేస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. విప్లవాత్మమైన మార్పులు తెచ్చి పాలన సాగించామన్నారు. తన పాలనలో నిరుద్యోగాన్ని తగ్గించామని, 2 లక్షల 30 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సీఎం జగన్ పేర్కొన్నారు. అవ్వాతాతలు, అక్క చెల్లెళ్లు తనను మళ్లీ ఆదరించాలని సీఎం జగన్ కోరారు.

Next Story