మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు... కారణం ఇదే

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీకి (DELHI) పయనం

మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు... కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీకి (DELHI) పయనం కానున్నారు. రేపు ఢిల్లీకి మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. భారత పరిశ్రమల సమాఖ్య ( Confederation of Indian Industry) వార్షిక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం రేపు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో ( Taj Palace) జరగనుంది.

పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై.... ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రేపు ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు... ఈ కార్యక్రమంతో పాటు... కేంద్ర మంత్రులను కూడా కలిసి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు ఇండస్ట్రీయల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులకు కూడా వస్తారని తెలుస్తోంది.

Next Story