Ap News: బీజేపీ ఏపీ చీఫ్‌గా పురంధేశ్వరి.. తొలి ట్వీట్ ఇదే..

by Disha Web Desk 16 |
Ap News: బీజేపీ ఏపీ చీఫ్‌గా పురంధేశ్వరి..  తొలి ట్వీట్ ఇదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన ఆమె ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేసినట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.

‘నడ్డాను కలిశాను. నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను. నాకిచ్చిన బాధ్యత విషయంలో నిబద్ధతతో పని చేస్తానని మాటిచ్చాను” అని పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఏపీ, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కూడా కృషి చేస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ట్విటర్ వేదికగా తెలిపారు.

Next Story

Most Viewed