ఏపీ బీజేపీలో దరఖాస్తుల వెల్లువ

by Disha Web Desk 16 |
ఏపీ బీజేపీలో దరఖాస్తుల వెల్లువ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించిన తర్వాత ఆ పార్టీ రాష్ట్రంలో బలపడుతోంది. అన్ని నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వరుస కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రం రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. పోటీ చేసుందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో పోటీదారుల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే అనూహ్య స్పందన లభించింది. దాదాపు రెండు వేల మంది వరకూ దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి పది మంది వరకూ పోటీ పడుతున్నారు. దీంతో వీరి దరఖాస్తులను రెండు రోజులుగా బీజేపీ ముఖ్య నేతలు పరిశీలిస్తున్నారు. త్వరలో అభ్యర్థులను జాబితాను రెడీ చేసి విడుదల చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. అంతేకాదు పొత్తులపై పార్టీ అధిష్టానమే క్లారిటీ ఇస్తుందని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రజలు మార్పు ఆశిస్తున్నారని, అభివృద్ధి చేసే వారినే ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారని పురంధేశ్వరి తెలిపారు.

Next Story

Most Viewed