AP : పల్నాడు జిల్లాలో పెద్దపులుల కలకలం

by Disha Web Desk 4 |
AP : పల్నాడు జిల్లాలో పెద్దపులుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పల్నాడు జిల్లాలో పెద్దపులులు కలకలం సృష్టించాయి. టైగర్ రిజర్వ్ నుంచి జిల్లాలోకి 2 పులులు ప్రవేశించడంతో టెన్షన్ నెలకొంది. దుర్గి, బొల్లాపల్లి, కారంపూడి మండలాల్లోకి పులులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్స్ హెచ్చరించారు. గ్రామాల్లోకి పులులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. అయితే తాజాగా దుర్గి మండలం గజాపురంలో ఆవుపై పులి దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులిదాడి సమాచారాన్ని స్థానికులు అధికారులకు తెలిపారు.

Next Story

Most Viewed