Ap Asembly: వైసీపీ బాయ్​కాట్.. అసెంబ్లీకి అలా వచ్చి.. ఇలా వెళ్లారు

by Thanuru Gopichand |

ప్రతిపక్షంగా గుర్తించండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ వైసీపీ సభ్యులు అసెంబ్లీ లో నినాదాలు చేశారు.

Ap Asembly: వైసీపీ బాయ్​కాట్.. అసెంబ్లీకి అలా వచ్చి.. ఇలా వెళ్లారు
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : ప్రతిపక్షంగా గుర్తించండి...ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ వైసీపీ సభ్యులు అసెంబ్లీ(Ap Asembly)లో నినాదాలు చేశారు. పది నిముషాలకే బాయ్​కాట్​చేశారు. అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్​అబ్దుల్​నజీర్ ప్రసంగాన్ని మొదలు పెట్టగానే వైసీపీ సభ్యులు సేవ్​డెమోక్రసీ అంటూ నినాదాలు మొదలు పెట్టారు. వుయ్​వాంట్​జస్టిస్​అంటూ గవర్నర్​ ప్రసంగానికి అడ్డు తగిలారు. పోడియం వద్దకు వచ్చి నిలుచున్నారు. తొలుత వైఎస్ జగన్​ తన సభ్యుల సహా అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కావాలంటూ వైసీపీ మొదటినుంచి డిమాండ్​ చేస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్​కు జగన్(YS jagan)​ లేఖ రాశారు. అక్కడి నుంచి సమాధానం లేకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ పిటిషన్​పెండింగ్​లో ఉంది. దీంతో గత సమావేశాలకు జగన్​ హాజరు కాలేదు. ఆయనతో పాటు మిగిలిన సభ్యులు కూడా హాజరు కాలేదు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందని వైసీపీ అంటోంది. అయితే నిబంధనల ప్రకారం ఇవ్వడం కుదరని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో జగన్​ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్​ ప్రసంగం ప్రారంభం కాగానే.. వైసీపీ సభ్యులు ప్రతిపక్షంగా గుర్తించండి అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటికి అసెంబ్లీ నుంచి బాయ్​కాట్​ చేశారు.

Next Story