ఏపీ సర్కార్‌కు మరో తీపి కబురు.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-26 05:18:18  IST  )

కూటమి సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

ఏపీ సర్కార్‌కు మరో తీపి కబురు.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఈ మేరకు తాజాగా రాష్ట్రానికి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఏకంగా రూ.1,121.20 కోట్ల నిధులు జమయ్యాయి. అయితే, ఇందులో గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్‌లకు 20 శాతం, జిల్లా పరిషత్‌లకు 10 శాతం నిధులు కేటాయించనున్నారు. జనాభా ప్రాతిపదికన ఆయ గ్రామ పంచాయతీల బ్యాంక్ అకౌంట్లలో నిధులను ఆర్థిక శాఖ అనుమతితో పంచాయతీ రాజ్‌ శాఖ త్వరలోనే జమ చేయనుంది.

Next Story