రాష్ట్రంలో మరో కొత్త పాలసీ.. ఆ నిబంధన సడలింపు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో మరో కొత్త పాలసీ అందుబాటులోకి వచ్చింది....

రాష్ట్రంలో మరో కొత్త పాలసీ.. ఆ నిబంధన సడలింపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(Government) వినూత్నంగా పాలన సాగిస్తోంది. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ ఔరా అనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలకు కొత్త కొత్త పాలసీలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే పలు పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో పాలసీ(Another Policy)కి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బార్ పాలసీ(New Bar Policy)ని అమల్లోకి తీసుకుంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 840 బార్లకు ముందే రెస్టారెంట్ లైసెన్స్ తీసుకోవాలన్న నిబంధనను సడలించింది. అలాగే బార్ లైసెన్స్ ఫీజును ఇక నుంచి 6 విడతల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ అమల్లోకి వచ్చిందని తెలిపారు. దీంతో బార్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి.

Next Story