ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

by Disha Web Desk 21 |
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే వడమాల చెక్ పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడింది. ఈ లారీని మూడు వాహనాలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని అదే మార్గంలో వేగంగా వస్తున్న కారు రోడ్డుకు అడ్డంగా పడిన లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అదే సందర్భంలో చిత్తూరు నుండి బైక్ పై వెళ్తున్న ముగ్గురు రోడ్డుపై అడ్డంగా ఉన్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే ఈ ప్రమాదంలో వాహనాలు వరుసగా ఢీకొట్టి నేపథ్యంలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి, ఆయన కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు.

Next Story

Most Viewed