- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీత పిటిషన్పై విచారణ వాయిదా
by Vemula.Srinu Prasad |
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు లోతుగా సాగలేదని, అసలు నిజాలు బయటకు రావాలంటే మరింత సమగ్ర విచారణ అవసరమని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Former Minister YS Vivekananda Reddy Murder Case)లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు(CBI investigation) లోతుగా సాగలేదని, అసలు నిజాలు బయటకు రావాలంటే మరింత సమగ్ర విచారణ అవసరమని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి(Sunita Reddy) సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ మూడు ఛార్జ్షీట్లను దాఖలు చేసినప్పటికీ, లోతైన దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు.
ఈ పిటిషన్పై..
అయితే సునీతారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్పై సీబీఐ కోర్టు స్పందించింది. పిటిషన్ కాపీలను నిందితులందరికీ అందజేయాలని ఆదేశించింది. నిందితుల వాదనలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
Next Story






