టీడీపీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మరో కీలక నేత మృతి

by Disha Web Desk 2 |
టీడీపీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మరో కీలక నేత మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా హఠాన్మరణం చెందుతున్నారు. తాజాగా.. గుండెపోటుతో టీడీపీ కీలక నేత మృతిచెందారు. ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజా గుండెపోటుతో మృతిచెందారు. శనివారం రాత్రి ఉన్నపళంగా గుండెపోటు రావడంతో హుటాహుటిన కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిచెందిన కనీసం వారం రోజులు కూడా గడవకముందే గుండెపోటుతో మరో టీడీపీ నేత వరుపుల రాజా మరణించడం పార్టీ శ్రేణులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.


Next Story

Most Viewed