వైసీపీలో మరో కీలక పరిణామం.. ముఖ్య నేతలపై సస్పెన్షన్ వేటు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ (YCP)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

వైసీపీలో మరో కీలక పరిణామం.. ముఖ్య నేతలపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ (YCP)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ పరిధిలో మొత్తం నలుగురిని పార్టీ నుంచి బహిష్కరించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో వడమలపేట ఎంపీపీ విజయలక్ష్మి, అత్తూరు ఎంపీటీసీ దుర్గాదేవి, ఆరూరు ఎంపీటీసీ ఎం. రమ్య, బూచివనత్తం ఎంపీటీసీ డి. రాజగోపాల్ ఉన్నారు. వీరి సస్పెన్షన్‌కు పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కూడా ఆమోదం తెలిపినట్లుగా ఇవాళ ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లిఖితపూర్వక ప్రకటన వెలువడింది.

Next Story