గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. స్వర్ణ గ్రామంగా ప్రకటన

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది...

గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. స్వర్ణ గ్రామంగా ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో గ్రామ(Village), వార్డు సచివాలయాల(Ward Secratariat) పేరును ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు ‘స్వర్ణ’ గ్రామం(Swarna Village)గా మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రభుత్వం సంస్థల్లో ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ, సచివాలయ పేర్లను సైతం మార్పు చేసింది. వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. కాగా 2019 అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి రోజున గ్రామ స‌చివాల‌య వ్యవ‌స్థను అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి అందుబాటులోకి తీసుకొచ్చారు.

Next Story