టీడీపీతో పొత్తు.. పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం..

by Dishafeatures2 |
టీడీపీతో పొత్తు.. పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీతో పొత్తుపై ఇప్పటికే ప్రకటన చేయగా.. ఆ పార్టీతో కోఆర్డినేషన్ కోసం జనసేన నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా నాదెండ్ల మనోహర్‌ను నియమించారు. స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్‌కు ఎంతో అనుభవం ఉందని, ఆయన అనుభవం ఉపయోగపడుతుందని పవన్ అన్నారు.

టీడీపీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు ఈ కమిటీని పవన్ నియమించినట్లు జనసేన తెలిపింది. అయితే ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీతో పొత్తు గురించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి టీడీపీతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. టీడీపీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో కూడా జనసేన శ్రేణులు పాల్గొనాలని, మద్దతుగా ఉండాలని పవన్ తెలిపారు.

టీడీపీతో పొత్తు గురించి ప్రకటించిన తర్వాత కోఆర్డినేషన్ కోసం కమిటీని ప్రకటించడంతో.. పవన్ మరో ముందడుగు వేసినట్లు అయింది. అయితే జనసేన పార్టీ ఎన్డీయేలోనే కొనసాగుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని నేతలకు పవన్ తెలిపారు. పార్టీ శ్రేణులు ఎలాంటి భేషజాలకు వెళ్లవద్దని, కలిసి పనిచేయాలని సూచించారు. పార్టీలో అందరూ ఒక్కటేనని పేర్కొన్నారు.

Next Story

Most Viewed