Breaking News: సినీ నటి సౌమ్యశెట్టిపై మరో ఫిర్యాదు..

by Disha Web Desk 3 |
Breaking News: సినీ నటి సౌమ్యశెట్టిపై మరో ఫిర్యాదు..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: సినీ నటి కిల్లంపల్లి సౌమ్య శెట్టి పై విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. తమ కుటుంబాన్ని, తమ కుమార్తె కుటుంబాన్నీ సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్న సౌమ్య శెట్టితో పాటు ఆమెకు సహకరిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలంటూ పోస్టల్ శాఖ మాజీ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రసాద్ కుమార్తె మౌనికతో స్నేహంగా ఉంటూ సౌమ్య శెట్టి తరచూ వారింటికి వెళ్లేది. ఈ క్రమంలో పలు దఫాలుగా ప్రసాద్ ఇంట్లో 74 తులాల బంగారాన్ని సౌమ్య చోరీ చేయగా, గత ఫిబ్రవరి 25న ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఫోర్త్ టౌన్ క్రైం పోలీసులు విచారణ జరిపి సౌమ్యను అరెస్టు చేసి 35తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే తాజాగా సౌమ్య శెట్టికి సంబంధించిన మరో వార్త వెలుగు చూసింది. బెయిల్ పై బయట ఉన్న సౌమ్యశెట్టి రకరకాలుగా పోస్టులు పెడుతూ వివిధ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సౌమ్యశెట్టిపై ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె కుటుంబాన్నీ సౌమ్య ఇన్స్టా, యూట్యూబ్, ఇంటర్వ్యూల ద్వారా సోషల్ మీడియా వేదికగా ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడుతోందని ఫిర్యాదులోపేర్కొన్నారు.

ఈ వ్యవహారాల వల్ల తన కుటుంబం, తన కుమార్తె కుటుంబం మానసిక క్షోభ అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సౌమ్యతో పాటు ఆమె తల్లి, సౌమ్య భర్త బలరాం, రాపల్లి మురళీ, మొవ్వ మౌనిక తదితరులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే ఫిర్యాదును డీజీపీకి కూడా అందజే శారు. వాస్తవానికి తాను పడుతున్న ఇబ్బందు లపై ప్రసాద్ కుమార్తె మౌనిక కూడా సౌమ్య శెట్టిపై సైబర్ క్రైం పోలీసులతో పాటు మానవ హక్కుల సంఘానికీ ఇటీవలే ఫిర్యాదు చేశారు.


Next Story

Most Viewed