సతీ సమేతంగా రండి.. సీఎం చంద్రబాబుకు గజల్ శ్రీనివాస్ ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

ప్రపంచ తెలుగు మహాసభలకు రావాలని సీఎం చంద్రబాబును ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యులు ఆహ్వానించారు....

సతీ సమేతంగా రండి.. సీఎం చంద్రబాబుకు గజల్ శ్రీనివాస్ ఆహ్వానం
X

దిశ, వెడ్ డెస్క్: ఆంధ్ర సారస్వత పరిషత్(Andhra Saraswata Parishad) ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 5 వరకు 3వ ప్రపంచ తెలుగు మహాసభల(Telugu Mahasabhas)ను నిర్వహించనున్నారు. గుంటూరు అమరావతి సత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణలో నందమూరి తారకరామారావు వేదిక నుంచి జరిగే ప్రారంభకార్యక్రమానికి సతీ సమేతంగా విచ్చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని ఆంధ్ర సారస్వత పరిషత్తుఅధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎంతో సానుకూలంగా స్పందించారని, మాతృ భాషా వికాసం కోసం ప్రజలందరూ కలసి కట్టుగా పని చేయాలని చంద్రబాబు సూచించారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.

Next Story