క్వాంటం యుగంలోకి ఏపీ: ఏప్రిల్ 14న తొలి 'క్వాంటం టెస్ట్ బెడ్' ప్రారంభం

by Vemula.Srinu Prasad |

సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌లను ఏప్రిల్ 14న సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు...

క్వాంటం యుగంలోకి ఏపీ: ఏప్రిల్ 14న తొలి క్వాంటం టెస్ట్ బెడ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వేదిక కాబోతోంది. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌లను ఏప్రిల్ 14న సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ప్రారంభించనున్నారు. అత్యాధునిక క్వాంటం చిప్‌ల తయారీ, పరిశోధనలు, పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం.. భారతదేశాన్ని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. సిలికాన్ వ్యాలీ తరహాలో రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

AI రంగంలో పెను మార్పు

ఈ క్వాంటం టెస్ట్ బెడ్‌లు అందుబాటులోకి రావడం వల్ల డేటా సెక్యూరిటీ, మెడికల్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. సూపర్ కంప్యూటర్లు సైతం చేయలేని క్లిష్టమైన లెక్కలను ఇవి సెకన్ల వ్యవధిలో పూర్తి చేస్తాయి. స్థానిక ఇంజనీర్లకు, శాస్త్రవేత్తలకు అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందించడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది. ఏప్రిల్ 14న జరగనున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమం ఏపీని హైటెక్ మ్యాప్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలబెట్టనుంది.

Next Story