రాయదుర్గంలో దొంగల బీభత్సం.. మూడు దుకాణాల్లో చోరీ

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా రాయదుర్గం శాంతినగర్‌‌లో దొంగలు బీభత్సం సృష్టించారు...

రాయదుర్గంలో దొంగల బీభత్సం.. మూడు దుకాణాల్లో చోరీ
X

దిశ, రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం శాంతినగర్‌‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక మారుతి వైన్‌ షాప్‌ తాళాలను పగులగొట్టి చోరీకి ప్రయత్నం చేశారు. కానీ విఫలయత్నం అయింది. ఈ వీడియో సీసీటీవీలో రికార్డు అయింది. అయితే గుమ్మగట్ట రోడ్డులోని మూడు దుకాణాల్లోకి చొరబడి నగదు, సరుకులను ఎత్తుకెళ్లారు. చోరీ విషయాన్ని గుర్తించిన షాపు ఓనర్లు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story