గుండు కొట్టించుకుని సర్పంచుల నిరసన

by Dishafeatures2 |
గుండు కొట్టించుకుని సర్పంచుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురం జిల్లా రాప్తాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద సర్పంచులు నిరసన తెలిపారు. పల్లెల అభివృద్ధిని వైసీపీ నిర్వీర్యం చేస్తోంది అని సర్పంచులు నిరసన తెలిపారు. స్థానిక సంస్థల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా సర్పంచులు గుండు కొట్టించుకున్నారు. అయితే గుండు చేసుకోవడానికి అనుమతి అడగలేదని పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు మైక్ పెట్టడానికి అనుమతి అడగలేదని మైక్‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రాప్తాడులో సర్పంచుల నిరసనకు మాజీమంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సర్పంచులకు విలువ లేకుండా చేసింది అని విమర్శించారు. పల్లెల అభివృద్ధిని వైసీపీ నిర్వీర్యం చేస్తోంది అని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed