Kallumari: వ్యవసాయ కూలీ దారుణ హత్య.. కూపీ లాగుతున్న పోలీసులు

by Disha Web Desk 16 |
Kallumari: వ్యవసాయ కూలీ దారుణ హత్య.. కూపీ లాగుతున్న పోలీసులు
X

దిశ మడకశిర: శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం కల్లుమరిలో హనుమంతరాయప్ప(69) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ కూలీగా జీవనం కొనసాగిస్తున్న హనుమంతరాయప్పను గుర్తు తెలయని వ్యక్తులు హత్య చేశారు. దీంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కళ్ళల్లో కారం చెల్లి రోకలి బండతో మోదీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి కుటుంబ కలహాలా?, ఆర్థిక వ్యవహారాలా అనే కోణంలో విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed