Atrocious: ఫించన్ డబ్బులు కోసం తల్లిని చంపిన కుమారుడు

by Disha Web Desk 16 |
Atrocious: ఫించన్ డబ్బులు కోసం తల్లిని చంపిన కుమారుడు
X

దిశ, అనంతపురం: వృద్ధాప్యంలో ఆలనా పాలన చూసుకోవాల్సిన కన్న కొడుకు కసాయిగా మారాడు. చెడు అలవాట్లకు బానిసై కన్నతల్లిని కడతేర్చాడు. ఈ విషాద సంఘటన శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం పందపర్తి గ్రామంలో నరసమ్మ (70) అనే వృద్ధ మహిళకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, చిన్న కుమారుడు శ్రీనివాసులు మద్యానికి బానిసై కన్నతల్లిని చూసుకోక పోవడంతో ఆమె ఒక చిన్న ఇంటిలో నివాసం ఏర్పరచుకొని ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తోంది. తల్లికి పింఛన్ డబ్బులు వచ్చాయన్న విషయం తెలుసుకుని మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని అడగాడు. వృద్ధురాలు నిరాకరించడంతో శ్రీనివాసులు విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన నరసమ్మ ఒకరోజు అంతా ఇంటిలోనే ఉండి ప్రాణాలను వదిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నరసమ్మ మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed