Anantapur: రోజురోజుకి రెచ్చిపోతున్న ఇసుక బకాసురులు

by Disha Web Desk 16 |
Anantapur: రోజురోజుకి రెచ్చిపోతున్న ఇసుక బకాసురులు
X

దిశ కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇసుక బకాసురులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం, చెన్నంపల్లి నూతిమడుగు నుంచి అక్రమార్కులు ఇసుకను రవాణా చేసి కోట్ల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన టిప్పర్ వాహనాల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ములకనూరు, చెర్లోపల్లి, ఐ పర్స్‌పల్లి, రాలనంతపురం, అచ్చంపల్లి, చెన్నంపల్లి, కురాకులపల్లి మీదుగా కర్ణాటక‌కు ఇసుక రవాణా చేస్తున్నారు. కళ్యాణదుర్గం నుంచి కంబదూరు వైపుగా టిప్పర్‌లో ఇసుకను తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. చాలా రోజుల నుంచి పట్టపగలే కర్ణాటకకు ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్టుడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక దందాకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed