Kalyanadurgam: 54 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 16 |
Kalyanadurgam: 54 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలులో బయలుదేరి కళ్యాణదుర్గం సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్ పి. గోపాల్ డ్రైవర్ సీట్లోనే సొమ్ము సిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు ఆపి ఊపిరి పీల్చుకున్నారు. ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహాయంతో స్పృహ తప్పిన డ్రైవర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం ఆర్టీసీ డిపో ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ గోపాల్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. మరో డ్రైవర్ సహాయంతో ప్రయాణికులను రాయదుర్గంకి చేర్చారు.

ఇవి కూడా చదవండి: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం

Next Story