Jammanippali: ప్రైవేట్ బస్సుకు తృటిలో తప్పిన విద్యుత్ ప్రమాదం

by Disha Web Desk 16 |
Jammanippali: ప్రైవేట్ బస్సుకు తృటిలో తప్పిన విద్యుత్ ప్రమాదం
X

దిశ మడకశిర: జమ్మానిపల్లి నుంచి వెంకటాపురం వెళ్లే రోడ్డులో ప్రైవేటు బస్సుకు విద్యుత్ ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్డుపై తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉన్నాయి. బస్సు వెళ్లే సమయంలో విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. అయితే ఆ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ ఎగిరిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఓ రైతు ట్రాక్టర్‌కు అగ్నిప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌లో మొక్క జొన్న సప్ప పశుగ్రాసం తీసుకుని వెళ్తున్న తరుణంలోనూ విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన గ్రామస్తులు మంటలు ఆర్పివేశారు. వరుస ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.



Next Story