Nara Lokesh: సీఎం జగన్‌కు మళ్లీ పంచ్.. ఆగ‌మేఘాలపై రంగులు వేశారంటూ చురకలు

by Disha Web Desk 16 |
Nara Lokesh: సీఎం జగన్‌కు మళ్లీ పంచ్.. ఆగ‌మేఘాలపై రంగులు వేశారంటూ చురకలు
X

దిశ, ధర్మవరం: అభివృద్ధి చేయ‌డం అంటే ఉన్నవాటికి రంగులు వేయ‌డం కాద‌ని సీఎం జ‌గ‌న్‌కి టీడీపీ యువ‌నేత నారా లోకేశ్ చుర‌క‌లంటించారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో భాగంగా ధర్మవరం 28వ వార్డులో టిడ్కో గృహాలను లోకేష్ పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ల‌బ్ధిదారులు త‌మ స‌మ‌స్యలను లోకేష్‌కి వివ‌రించారు. తాను వ‌స్తున్నాన‌ని, ఆగ‌మేఘాల మీద టిడ్కో ఇళ్లకి రంగులు వేయిస్తోన్న వైసీపీ స‌ర్కారు నాలుగేళ్లుగా వీటిని ప‌ట్టించుకోలేదని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

టిడ్కో ల‌బ్ధిదారులు ఏమ‌న్నారంటే..

‘గత ప్రభుత్వ హయాంలో ధర్మవరంలో పేదలకోసం రూ.600 కోట్ల వ్యయంతో 8,832 టిడ్కోగృహాల నిర్మాణం చేపట్టింది. లబ్ధిదారుల వాటాగా వివిధ కేట‌గిరీల‌కు నిర్ణయించిన మొత్తం 68 లక్షల రూపాయలు చెల్లించాం. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1440 టిడ్కో గృహాలకు లబ్ధిదారుల పేర్లు మార్చి వైసీపీ కార్యకర్తలను చేర్చారు. గత ప్రభుత్వ హయాంలోనే 80శాతానికి పైగా పూర్తయిన టిడ్కో ఇళ్లను నాలుగేళ్లుగా మాకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక గతంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన 8,832మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించాలి.’ అని టిస్కో లబ్ధిదారులు కోరారు.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ...

‘ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక ఏడాదికి 5 లక్షల ఇళ్లు కట్టిస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో కట్టింది నాలుగు ఇళ్లు మాత్రమే. కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్ మేం కట్టిన ఇళ్లకు మాత్రం సిగ్గులేకుండా రంగులు వేసుకుంటున్నారు. పేదవాడు కూడా సౌక‌ర్యవంతమైన ఇళ్లలో నివసించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో 5 లక్షల టిడ్కో గృహాలను గ్రౌండింగ్ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక కుంటిసాకులతో దాదాపు సగం ఇళ్లను రద్దు చేసింది. గత ప్రభుత్వంలోనే దాదాపు 90 శాతం పూర్తయిన 2.62 లక్షల టిడ్కో ఇళ్లను మిగిలిన 10 శాతం పూర్తి చేసి ఇవ్వకుండా గత నాలుగేళ్లుగా పాడుబెడుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ ఇళ్లు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం.’ అని లోకేష్ హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed