Tragedy: కూతుర్లను చెరువులో తోసి తల్లి ఆత్మహత్య

by Disha Web Desk 16 |
Tragedy: కూతుర్లను చెరువులో తోసి తల్లి ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇద్దరు కుమార్తెల మృతదేహాలను గజఈతగాళ్లు బయటకు తీశారు. మృతి చెందిన బాలికల వయస్సు 8,10 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. అయితే తల్లి కోసం పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు.



Next Story

Most Viewed