- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'కురుబలకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి'
దిశ, ఆలూరు: కురుబ సామాజిక వర్గానికి ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కురుబ సాధికారిక కమిటీ నాయకులు ఎన్.మోహన్ ప్రసాద్ కోరారు. ఆలూరు కురుబ సామాజిక సంఘం నాయకులు శనివారం హైదరాబాద్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్.మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా కురువలు 62 వేల మంది ఓటర్లున్నారని, అత్యధిక జనాభా కలిగిన తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. ఎమ్మెల్యే సీటు ప్రకటిస్తే అన్ని సామాజిక వర్గాల వారిని కలుపుకొని అత్యధిక మెజార్టీతో టీడీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుబ సాధికారిక కమిటీ అధ్యక్షుడు వెంకట్ రాముడు, బీసీ జాతీయ సంగం జాతీయ కార్యదర్శి రామకృష్ణ, బైలు పత్తికొండ గోవిందు, హాలహర్వి హనుమంతు రెడ్డి, హొలగుంద గాదిలింగ, ఆస్పరి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.