Anantapur: కుక్కర్ పేలి నలుగురు చిన్నారులకు గాయాలు

by Disha Web Desk 16 |
Anantapur: కుక్కర్ పేలి నలుగురు చిన్నారులకు గాయాలు
X

దిశ, కళ్యాణదుర్గం: అనంతపూర్ జిల్లా కంబదూరు మండలం ములకనూరు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. వంట కుక్కర్ పేలి నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్‌వాడీ కేంద్రంలో వంట చేసే సమయంలో కుక్కర్ పేలింది. అంతేకాదు పక్కనే ఉన్న పిల్లలపై ఎగిరి పడింది. అయితే ఈ ఘటనను అంగన్వాడీ నిర్వాహకులు రహస్యంగా ఉంచారని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీడీపీవో వనిజ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed