విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతుల నిరసన

by Dishafeatures2 |
విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతుల నిరసన
X

దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వ్యవసాయానికి సరిగ్గా కరెంట్ సరఫరా చేయడం లేదంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి కుమారుడు, టీడీపీ యువ నేత డాక్టర్ ఉన్నం మారుతీ చౌదరి పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. కనీసం 7 గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతుల ప్రభుత్వం అని మాటల్లో చెప్పుకోవడం కాదని చేతుల్లో చూపించాలని విమర్శించారు. గడప గడపకు వెళ్లి అక్కడ చెప్పే మాటలన్నీ అపద్దాలే అన్నారు. అనంతరం విద్యుత్ ఈఈ హామీ మేరకు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాము, గరికపాటి నవీన్, పాలవాయి, భట్టువానిపల్లి రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed