కలుషిత నీరు కలకలం.. 22 మందికి వాంతులు విరేచనాలు

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా శింగనమల మండలం పెద్దమట్టగొందిలో కలుషిత నీరు కలకలం రేగింది..

కలుషిత నీరు కలకలం.. 22 మందికి వాంతులు విరేచనాలు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా శింగనమల మండలం పెద్దమట్టగొందిలో కలుషిత నీరు(Contaminated water) కలకలం రేగింది. రెండు రోజులుగా గ్రామంలో కలుషిత సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఈ నీళ్లు తాగిన గ్రామస్తులకు ఆదివారం నుంచి వాంతులు(Vomiting), విరోచనాలు(Diarrhea) పట్టుకున్నాయి. దీంతో స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బంది అలర్ట్ అయింది. అస్వస్థతకు గురైన వారిని శింగనమల ఆస్పత్రికి తరలించారు. అటు మున్సిపల్ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. గ్రామంలో నీటి సరఫరాను నిలిపివేశారు. గ్రామంలో సరఫరా అయిన నీటి శాంపిల్స్‌ను తీసుకున్నారు. పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపారు.

Next Story