మా ప్రస్తావన వద్దు...అచ్చెన్నాయుడికి బీజేపీ నేత వార్నింగ్

by Disha Web Desk 16 |
మా ప్రస్తావన వద్దు...అచ్చెన్నాయుడికి బీజేపీ నేత వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఖండించారు. వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలెందుకు అచ్చెన్నాయుడు అంటూ నిలదీశారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో గురువారం విష్ణువర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా తెలుగుదేశం పార్టీ తీరు ఉందని ఘాటు విమర్శలు చేశారు. చాలా ఎన్నికల్లో పోటీ చేయలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారన్నారు.

ఇప్పుడు కేంద్రం, బీజేపీ చర్యలు తీసుకోవాలని ప్రకటనలు ఎందుకు అని విష్ణువర్థన్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రాల శాంతి భద్రతల్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం 2018-19 సమయంలోనే రాష్ట్రపతి పాలన వచ్చేది కాదా? అని అన్నారు. ఓ వైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ .. మరో వైపు పార్టీని దెబ్బతీసే ప్రకటనలు ఎందుకు? అని ప్రశ్నించారు. యూటర్నులతో ఏ మాత్రం విశ్వాసం లేని రాజకీయాలు చేసే పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. చేతనైతే వైసీపీపై పోరాడాలని ప్రతీదానికి బీజేపీ ప్రస్తావన మానుకోవాలని అచ్చెన్నాయుడుకు సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు.



Next Story

Most Viewed