- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > అనంతపురం > Ananthapuram : సత్యసాయి జిల్లాలో దారుణం.. విద్యార్థులను చితకబాదిన టీచర్లు
Ananthapuram : సత్యసాయి జిల్లాలో దారుణం.. విద్యార్థులను చితకబాదిన టీచర్లు
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : సత్యసాయి అనంతపురం(Satyasai Aanthapuram) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రోళ్ళ మండలం కాకి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల టీచర్లు పలువురు విద్యార్థులపై దాష్టీకానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ట్యాబులు వెనక్కి ఇవ్వాలని విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు చితకబాదారు. దెబ్బలు తాళలేక పలువురు విద్యార్థులు ట్యాబులు వెనక్కి ఇచ్చారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని నిలదీయగా.. టీచర్లు దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరిపి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
- Tags
- ananthapur
Next Story