KADIRI: అక్రమ సంబంధం వల్ల ఆస్తులు పాయే!

by Disha Web Desk 16 |
KADIRI: అక్రమ సంబంధం వల్ల ఆస్తులు పాయే!
X

దిశ, కదిరి: సాఫీగా సాగిపోతున్న సంసారంలోకి అక్రమ సంబంధం పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. తనకన్నా వయసులో పెద్దైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని పారిపోయారు. ఆ మహిళ ప్రమాదవశాత్తు మరణించింది. విషయం తెలిసిన మహిళ బంధువులు ఆందోళనతో తన ఆస్తిని రాసిచ్చారు. పిల్ల పాపలతో జీవిస్తున్న ఒక కుటుంబానికి అక్రమ సంబంధం తీవ్ర నష్టాన్ని కలిగించిన సంఘటన సత్యసాయి జిల్లా కదిరిలో వెలుగు చూసింది.

కదిరి పట్టణంలోని పార్థసారథి కాలనీ‌కి చెందిన వ్యక్తికి ఇరువురు పిల్లలు, భార్యతో కలిసి జీవిస్తున్నారు. అదే కాలనీకి చెందిన మరో మహిళతో ఆయనకు అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో ఆమెను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే సహజీవనం సాగించారు. అయితే ఆ మహిళ హైదరాబాద్‌లో గత శనివారం ప్రమాదవశాత్తు బస్సు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ఆ వ్యక్తి గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాని చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. దీంతో ఆమెను వదిలేసి ఆ వ్యక్తి కదిరికి వెళ్లి మామూలుగా ఉండిపోయారు.

అయితే గాంధీ హాస్పిటల్ నుంచి మహిళ మరణ వార్త ఆమె కుటుంబసభ్యులకు అందింది. దీంతో హైదరాబాద్ వెళ్లి ఆమెను కదిరి పట్టణానికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని నిందితుడి ఇంటి ముందు ఉంచి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న కదిరి పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ పిలిపించి ఆ వ్యక్తికి చెందిన ఒక ఇంటిని ఆమె ముగ్గురు కుమార్తెలకు చెందేలా ఒప్పందం చేశారు. దీంతో వివాదం సద్దుమనిగింది.



Next Story

Most Viewed