ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య: మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-08 17:40:22  IST  )

అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య ఘటన తీవ్రంగా కలచి వేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు..

ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య: మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి(Inster Student Tanmayi) హత్య ఘటన తీవ్రంగా కలచి వేసిందని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) అన్నారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం షాక్‌‌కు గురిచేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదన్నారు. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తానని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.

Next Story