విశాఖ బస్టాండులో దారుణం.. బస్సుకోసం వేచివున్న మహిళ స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

విశాఖలో అందరూ చూస్తుండగానే ప్రమాదం జరిగింది..

విశాఖ బస్టాండులో దారుణం.. బస్సుకోసం వేచివున్న మహిళ స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో అందరూ చూస్తుండగానే ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌(Rtc Complex)లో బస్సు(Bus) అదుపు తప్పి ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లింది. అంతేకాదు అక్కడున్న ప్రయాణికుల(Passengers)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ స్పాట్‌లోనే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కళ్లు తెరిచి కళ్లు మూసేలోపే మహిళ ప్రాణం పోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.

Next Story