ప్రపంచం మొత్తం ప్రధాని మోడీ జపం: విశాఖలో హాంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
Home Minister Amit Shah
X

దిశ, వెబ్‌డెస్క్: మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం తీరంలో మోడీ తొమ్మిదేళ్ల పాలన వివరించేందుకు బీజేపీ ఏర్పాటు చేసిన సభకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం ముందు భారత్ గౌరవాన్ని ప్రధాని మోడీ పెంచారని ప్రశంసించారు. ప్రపంచమంతా ప్రధాని మోడీ జపం చేస్తోందని అమిత్ షా అన్నారు. యూపీఏ 10 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల అవినితీ జరిగిందని.. అయిన అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము ఆ ప్రభుత్వానికి లేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భారత సైనికులకు బలం పెరిగిందని.. పాక్ సరిహద్దుల్లోకి చొరబడి శత్రువులకు సమాధానమిచ్చామని చెప్పారు. భారత్‌పై దాడి జరిగిన 10 గంటల్లోనే సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రతీకారం తీర్చుకున్నామని అమిత్ షా గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి:

జగన్ ఆ విషయంలో సిగ్గు పడాలి: YCP సర్కార్‌పై అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed