అంబేద్కర్ విగ్రహావిష్కరణ అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం

by Disha Web Desk 1 |
అంబేద్కర్ విగ్రహావిష్కరణ అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్ : విజయవాడ వేదికగా ప్రపంచంలోనే అతి ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా రూపొందిస్తోంది. అయితే, విగ్రహావిష్కరణకు తాజాగా ప్రభుత్వం ఓ డేట్ ఫిక్స్ చేసింది. జనవరి 19న విగ్రహాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ, స్మృతి వనం ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విజయవాడకు తండోపతండాలుగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 1.20 లక్షల మంది సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించనున్నట్లు సమాచారం. న్నందున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed