- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీటీ వారెంట్.. రాజమండ్రి నుంచి గుంటూరుకు అంబటి తరలింపు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో గత వారం అరెస్టైన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు.

దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో గత వారం అరెస్టైన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ.. గతేడాది నవంబర్ 12న చేసిన ధర్నాలో బారికేడ్లను తోసుకుంటూ.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. ఈ కేసులో అంబటి రాంబాబును విచారించేందుకు పట్టాభిపురం పీఎస్ పోలీసులు నిన్న పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గుంటూరు కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. అలాగే సీఎంపై వ్యాఖ్యల కేసులో గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. దానిపై కూడా నేడు విచారణ జరగనుంది. మరోవైపు అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్, రాజమండ్రి జైల్లో అదనపు సౌకర్యాల కోసం వేసిన పిటిషన్లపై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. నాలుగు పిటిషన్ల విచారణ ఉండటంతో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నఅంబటి రాంబాబును గుంటూరుకు తరలిస్తున్నారు.






