- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఫైర్.. అప్పుడు కుప్పంలో ఉప ఎన్నికలు వచ్చాయా?
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

దిశ, వెబ్డెస్క్: ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (AP Assembly Sessions) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishna Raju).. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
గతంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని ప్రతిజ్ఞ చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత సీఎంగా చంద్రబాబు (CM Chandrababu Naidu) ఓడిపోయినపుడు.. అసెంబ్లీకి రానంటూ ఏడుస్తూ వెళ్లారని, అప్పుడు కుప్పంలో ఉపఎన్నిక జరిగిందా? అని ప్రశ్నించారు. జగన్ అంటే ప్రభుత్వంలో భయం కనిపిస్తోందని, అందుకే ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.






