- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravati: మంత్రాలయం పీఠాధిపతి ఔదార్యం.. అమరావతి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం
by Kema Shiva Kumar |
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి (Amaravati Capital) నిర్మాణానికి అడుగు పడ్డాయి.

X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి (Amaravati Capital) నిర్మాణానికి అడుగు పడ్డాయి. ఈ క్రమంలో పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు రాజధాని నిర్మాణానికి తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను ఉండవల్లి (Undavalli) నివాసంలో మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు (Subudendra Tirthulu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మఠం సభ్యులంతా సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ మేరకు మంత్రాలయం తరఫున అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.
Next Story






