అల్లూరి పోరాటం స్వతంత్ర పోరాటంలో కీలక ఘట్టం: President Draupadi Murmu

by Disha Web Desk 19 |
అల్లూరి పోరాటం స్వతంత్ర పోరాటంలో కీలక ఘట్టం: President Draupadi Murmu
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌరసన్మానం చేసింది. పోరంకిలోని మురళి కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అందరికి నమస్కారం అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఆంధ్ర ఎన్నో విశిష్టతలకు నెలవని.. నాగార్జున కొండ, అమరావతి భారత ఆధ్యాత్మికతకు మూలం విలసిల్లాయని తెలిపారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్రపతి ముర్ము తెలుగు కవులను గుర్తు చేశారు. అల్లూరి సీతరామరాజు పోరాటం స్వతంత్ర పోరాటంలో కీలక ఘట్టమని కొనియాడారు.



Also Read....

పాదయాత్రలో బస్సు ఎక్కిన Bandi Sanjay.. ప్రయాణికుల బాధలు తెలుసుకుని..



Next Story

Most Viewed