తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి..సాయిధరమ్ తేజ్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-11-06 07:05:44  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి, హీరో సాయి ధరమ్ తేజ్ లు దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి..సాయిధరమ్ తేజ్
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలTirumala శ్రీ వేంకటేశ్వర స్వామివారిని అల్లు అర్జున్ సతీ మణి స్నేహ రెడ్డి(Snehareddy), హీరో సాయి ధరమ్ తేజ్ (Saidharam Tej) లు దర్శించుకున్నారు. బుధవారం సాయి ధరమ్ తేజ్ శ్రీ వారి మేల్కొలుపు సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా ఆశీర్వచనం చేశారు.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.

అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి కూడా సుప్రభాత సేవలో శ్రీ వారి దర్శనం చేసుకున్నారు. స్నేహా రెడ్డి తన స్నేహితులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆమెకు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More..

Allu Arjunపై కేసులో సంచలన అప్‌డేట్.. కీలక తీర్పిచ్చిన కోర్టు

Next Story