- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు అలర్ట్.. శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల గుంపు
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

దిశ,వెబ్డెస్క్: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుని.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. తిరుమల ఘాట్ రోడ్డులో, అలిపిరి మెట్టు మార్గంలో ఏనుగుల సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల సంచారం తీవ్ర కలకలం రేపింది. పంట పొలాలను గజరాజులు ధ్వంసం చేశాయి.
మెట్టుమార్గంలోని పంప్ హౌస్ వద్ద ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు తగలడంతో డ్రోన్ కెమెరా కింద పడిపోవడంతో అవి ఏ వైపుగా వెళుతున్నాయో గుర్తించలేకపోయారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మూడు విభాగాల అధికారులు శ్రీ వినాయక స్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను సుమారు గంట పాటు నిలిపివేశారు. రాష్ట్ర అటవీ, టీటీడీ విజిలెన్స్ అధికారులు సమన్వయంతో గజరాజులను అడవిలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో తిరుమల భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.






