- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aghori: ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీ.. కారును నిలపకుండా శ్రీశైలం వైపు ప్రయాణం
గత కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం(Secunderabad Muthyalamma Temple)లో ఆత్మార్పణం(Suicide) చేసుకుంటానని ప్రకటన చేసిన అఘోరీ ఇవాళ ఆంధ్రప్రదేశ్(AP) లో ప్రత్యక్షమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం(Secunderabad Muthyalamma Temple)లో ఆత్మార్పణం(Suicide) చేసుకుంటానని ప్రకటన చేసిన అఘోరీ ఇవాళ ఆంధ్రప్రదేశ్(AP) లో ప్రత్యక్షమైంది. ఆత్మకూరు(Athmakur)లో అఘోరీ కారును గుర్తించిన స్థానికులు.. గుమిగూడారు. దీంతో అఘోరీ కారును ఆపకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా.. కొందరు స్థానికులు కారును వెంబడించి ఆపాలని కోరారు. అయినా సరే కారును నిలపకుండా శ్రీశైలం(SRIShailam) రహదారి మీదుగా వెళ్లింది. దీంతో స్థానికులు నిరాశతో వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం జరగగా.. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ గుడిలో ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటన చేసింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని, ఆమె ఇంటికి తరలించారు. అక్కడి నుంచి ఆమె మహారాష్ట్ర(Maharastra) వెళ్లినట్టు తెలిసింది.






