పులివెందుల పిల్లి తాటాకు చప్పుళ్లకు భయపడం :అయ్యన్న అరెస్ట్‌పై అచ్చెన్నాయుడు

by Disha Web Desk 21 |
పులివెందుల పిల్లి తాటాకు చప్పుళ్లకు భయపడం :అయ్యన్న అరెస్ట్‌పై అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జగన్ రెడ్డి ఎంత కక్షతో రగిలిపోతున్నాడో అయ్యన్న పాత్రుడి అరెస్టే నిదర్శనం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అయ్యన్న అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి ప్రజాస్వామ్య మూలాలను ధ్వంసం చేస్తున్నాడు అని విరుచుకుపడ్డారు. గన్నవరం సభలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 60 మందిపై కేసులు పెడతారా? అధికార పార్టీ ఏం చేసినా చూస్తూ ఉండాలా? జగన్ రెడ్డికి పాలన చేతకాక టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ లు చేయించి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు అని మండిపడుతూ అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజూ చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఊరకుక్కల్లా మొరుగుతున్నా వారిపై ఒక్క చర్యా లేదు. మేము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరంగా మారింది. ఎంత సేపూ ప్రశ్నించే వారిని వేధించడం , అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వైసీపీ నేతలు ఏం చేసినా ప్రతిపక్షం నోరెత్తకుండా చేతులు కట్టుకొని వుండాలా? జగన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం.వైసీపీ అరాచక పాలనపై పోరాటం ఆగదు. ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం అని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Read More: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అరెస్ట్

Next Story

Most Viewed