టీడీపీకి జగన్ ఓటువేశాడేమో..?

by Dishanational2 |
టీడీపీకి జగన్ ఓటువేశాడేమో..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి జగన్ మరిచిపోయి ఓటు వేశాడేమోనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 19మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారని, రహస్య బ్యాలెట్ ఎన్నికల్లో 23ఓట్లు వచ్చాయని దీంతో పంచుమర్తి అనురాధ విజయం సాధించారన్నారు. రహస్య బ్యాలెట్‌లో ఎవరికి ఎవరూ ఓటువేశారని ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని సస్పెండ్ చేయడం సమంజసం కాదన్నారు. ఓటు విధానం సీక్రెట్ అని.. ఎలా నిర్దారిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేలను కాదు. టాఫింగ్ చేసిన జగన్ ను అన్నారు.

Next Story

Most Viewed