వేకువజామున రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

by Thanuru Gopichand |

విశాఖ జిల్లాలో వేకువజామున దుర్ఘటన చోటు చేసుకుంది. ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

వేకువజామున రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ జిల్లాలో వేకువజామున దుర్ఘటన చోటు చేసుకుంది. ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీని ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు, అంబులెన్స్కు స్థానికులు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story